News

కెసిఆర్ స్పీడ్ పెంచాలి


గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పీడ్ పెంచాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన నైఫుణ్యాభివృద్ది సమావేశంలో ఆయన మాట్లాడారు.వి విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిందని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచాలని నరసింహన్ వ్యాఖ్యానించడం విశేషం. ఆయన విద్య వ్యాపారంగా మారిందని , దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నరసింహన్ పేర్కొన్నారు.